ETV Bharat / bharat

'పీఎం కేర్స్​ నిధులపై సుప్రీం తీర్పు రాహుల్​కు చెంపపెట్టు'

author img

By

Published : Aug 18, 2020, 3:27 PM IST

పీఎం కేర్స్​ నిధులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్​ గాంధీ దుర్మార్గపు ఆలోచనలకు చెంపపెట్టు అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. దురుద్దేశ ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. సుప్రీం తీర్పు అనంతరం వరుస ట్వీట్లు చేశారు.

SC verdict on PM CARES 'resounding blow to nefarious designs' of Rahul Gandhi:Nadda
'పీఎం కేర్స్​ నిధులపై సుప్రీం తీర్పు రాహుల్​కు చెంపదెబ్బ '

పీఎం కేర్స్​ నిధులను ఎన్​డీఆర్​ఎఫ్​కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ దుర్మార్గపు ఆలోచనలకు, ఆయనకు వత్తాసు పలికే వారికి చెంపపెట్టు లాంటిదన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంగ్రెస్, దాని అనుచరుల హానికర ప్రయత్నాలు విఫలమై వాస్తవమే గెలిచిందన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

  • The verdict by Supreme Court on PM CARES is a resounding blow to the nefarious designs of Rahul Gandhi & his band of ‘rent a cause’ activists. It shows that the truth shines despite the ill intent and malicious efforts of the Congress party and its associates.

    — Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు.. రాహుల్, అద్దె కార్యకలాపాలు నిర్వహించే ఆయన మద్దతుదారులకు కోలుకోలేని దెబ్బ. పీఎం కేర్స్​కు విరాళాలిచ్చిన సాధారణ పౌరులంతా రాహుల్ తప్పుడు ప్రచారాలను తిరస్కరించారు. ప్రజల ద్వారా సేకరించిన పీఎంఎన్​ఆర్​ఎఫ్​ నిధులను కాంగ్రెస్​ కుటుంబ ట్రస్టులకు బదిలీ చేసుకుని దశాబ్దాలుగా వాడుకుంది. పీఎం కేర్స్​పై తప్పుడు ప్రచారం చేయాలనుకోవడం కాంగ్రెస్ పాపాలను కడగడానికి చేసిన ప్రయత్నమని దేశ ప్రజలందరికీ తెలుసు. "

-జేపీ నడ్డా ట్వీట్​

ఒక్క అవినీతి ఆరోపణ లేదు..

సుప్రీంతీర్పుపై న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్​ కూడా స్పందించారు. పీఎం కేర్స్​ నిధుల నిర్వహణ చట్టపరంగా, పారదర్శకంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కోలేదని గుర్తు చేశారు. విద్వేష ప్రసంగాలపై ఫేస్​బుక్​ సీఈఓకు కాంగ్రెస్​ లేఖ రాయడాన్ని విమర్శించారు రవిశంకర్​. గతంలో సోనియా గాంధీ 'ఆర్​ పార్ కీ​ లడాయి' అనడం, మోదీపై రాహుల్​ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వేషపూరిత ప్రసంగాలు కావా? అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'పీఎం కేర్స్​ నిధుల బదిలీ అవసరం లేదు'

పీఎం కేర్స్​ నిధులను ఎన్​డీఆర్​ఎఫ్​కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ దుర్మార్గపు ఆలోచనలకు, ఆయనకు వత్తాసు పలికే వారికి చెంపపెట్టు లాంటిదన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంగ్రెస్, దాని అనుచరుల హానికర ప్రయత్నాలు విఫలమై వాస్తవమే గెలిచిందన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

  • The verdict by Supreme Court on PM CARES is a resounding blow to the nefarious designs of Rahul Gandhi & his band of ‘rent a cause’ activists. It shows that the truth shines despite the ill intent and malicious efforts of the Congress party and its associates.

    — Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు.. రాహుల్, అద్దె కార్యకలాపాలు నిర్వహించే ఆయన మద్దతుదారులకు కోలుకోలేని దెబ్బ. పీఎం కేర్స్​కు విరాళాలిచ్చిన సాధారణ పౌరులంతా రాహుల్ తప్పుడు ప్రచారాలను తిరస్కరించారు. ప్రజల ద్వారా సేకరించిన పీఎంఎన్​ఆర్​ఎఫ్​ నిధులను కాంగ్రెస్​ కుటుంబ ట్రస్టులకు బదిలీ చేసుకుని దశాబ్దాలుగా వాడుకుంది. పీఎం కేర్స్​పై తప్పుడు ప్రచారం చేయాలనుకోవడం కాంగ్రెస్ పాపాలను కడగడానికి చేసిన ప్రయత్నమని దేశ ప్రజలందరికీ తెలుసు. "

-జేపీ నడ్డా ట్వీట్​

ఒక్క అవినీతి ఆరోపణ లేదు..

సుప్రీంతీర్పుపై న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్​ కూడా స్పందించారు. పీఎం కేర్స్​ నిధుల నిర్వహణ చట్టపరంగా, పారదర్శకంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కోలేదని గుర్తు చేశారు. విద్వేష ప్రసంగాలపై ఫేస్​బుక్​ సీఈఓకు కాంగ్రెస్​ లేఖ రాయడాన్ని విమర్శించారు రవిశంకర్​. గతంలో సోనియా గాంధీ 'ఆర్​ పార్ కీ​ లడాయి' అనడం, మోదీపై రాహుల్​ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వేషపూరిత ప్రసంగాలు కావా? అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'పీఎం కేర్స్​ నిధుల బదిలీ అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.